Published on Apr 29, 2025
Current Affairs
యూట్యూబ్‌ కంట్రీ ఎండీగా గుంజన్‌ సోనీ
యూట్యూబ్‌ కంట్రీ ఎండీగా గుంజన్‌ సోనీ

భారత్‌లో యూట్యూబ్‌ కంట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గుంజన్‌ సోనీ 2025, ఏప్రిల్‌ 28న నియమితులయ్యారు. దీనికి ముందు జలోరా గ్రూప్‌ సీఈఓగా సోనీ ఆరేళ్లు పని చేశారు. అంతకు ముందు స్టార్‌ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంఓగా బాధ్యతలు నిర్వర్తించారు. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఇ-కామర్స్‌లో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉంది.