వివిధ రంగాల పరిశ్రమల నిపుణులను ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా నియమించుకోవడంలో తమిళనాడు ముందుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆయా రంగాల్లో నిపుణులైన వారిని విశ్వవిద్యాలయాల్లో ఫ్రొఫెసర్లుగా నియమించుకోవడానికి 2022లో యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ క్రమంలో తమిళనాడులోని విశ్వవిద్యాలయాలు 395 మంది పరిశ్రమల నిపుణులను ప్రొఫెసర్లుగా నియమించుకుని మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర(193), గుజరాత్(179), కర్ణాటక (170)లు ఉన్నాయి.