కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం-డబ్ల్యూఈఎఫ్) ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’లో ఒకరిగా ఎంపికయ్యారు. తమ తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న 40 ఏళ్ల లోపు వారిని డబ్ల్యూఈఎఫ్ ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ దఫా ప్రపంచ నలుమూలల నుంచి 116 మందిని ఎంపిక చేశారు.