Published on Jun 13, 2025
Current Affairs
యూఎన్‌హెచ్‌సీఆర్‌ నివేదిక
యూఎన్‌హెచ్‌సీఆర్‌ నివేదిక

హింసా దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్‌హెచ్‌సీఆర్‌) నివేదిక పేర్కొంది.

ఈ సంఖ్య గతేడాదికన్నా 20 లక్షలు ఎక్కువ.

దశాబ్దం క్రితంతో (2105) పోలిస్తే దాదాపు రెట్టింపు అని నివేదిక వివరించింది.

సంఘర్షణల వల్ల స్వదేశం విడచిపెట్టిన శరణార్థుల్లో మూడింట రెండు వంతులు పొరుగు దేశాల్లోనే తల దాచుకొంటున్నారని నివేదిక తెలిపింది.