హింసా దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్హెచ్సీఆర్) నివేదిక పేర్కొంది.
ఈ సంఖ్య గతేడాదికన్నా 20 లక్షలు ఎక్కువ.
దశాబ్దం క్రితంతో (2105) పోలిస్తే దాదాపు రెట్టింపు అని నివేదిక వివరించింది.
సంఘర్షణల వల్ల స్వదేశం విడచిపెట్టిన శరణార్థుల్లో మూడింట రెండు వంతులు పొరుగు దేశాల్లోనే తల దాచుకొంటున్నారని నివేదిక తెలిపింది.