Published on Dec 10, 2024
Current Affairs
యూఎన్‌సీసీడీ నివేదిక
యూఎన్‌సీసీడీ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌సీసీడీ తన నివేదికలో పేర్కొంది. గత 30 ఏళ్లుగా 77 శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది.

ఈ సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కి.మీ. పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40 శాతంపైనేనని వెల్లడించింది.

2024, డిసెంబరు 9న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన యూఎన్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసెర్టిఫికేషన్‌ (యూఎన్‌సీసీడీ) సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.