Published on Jun 10, 2025
Current Affairs
మహా సముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ
మహా సముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ

మహాసముద్రాల రక్షణకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మూడో మహాసభ ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో 2025, జూన్‌ 9న ప్రారంభమైంది.

సముద్రాలను కాపాడతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాగ్దానాలను ఆచరణలో పెట్టాలనీ, మాటలను చేతలుగా మార్చాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మెక్రాన్‌ పిలుపు ఇచ్చారు.  

2030కల్లా 30శాతం భూమినీ, 30శాతం సముద్రాలనూ కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు 2.7 శాతం సముద్రాలకే రక్షణ కల్పంచగలుగుతున్నాం.

ఆ పరిమిత జలాల్లో మాత్రమే మితిమీరిన చేపల వేట, ఖనిజ తవ్వకాలను నివారించగలుగుతున్నాం అని మెక్రాన్‌ పేర్కొన్నారు. 

2023లో కుదిరిన అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణ ఒప్పంద ముసాయిదాకు నీస్‌ మహాసభలో ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

అది అమలులోకి రావాలంటే కనీసం 60 దేశాలు సమ్మతించాలి. జూన్‌ 9 నాటికి 32 దేశాలు మాత్రమే ఆమోదం తెలిపాయి.

ఫ్రాన్స్, దక్షిణకొరియా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు ఆమోదం తెలిపినా, విశాల సముద్ర తీరం కలిగిన పెద్ద దేశాలు ఇంకా దారికి రాలేదు.

జీ20 సభ్యదేశాల్లో అత్యధికం సమ్మతి తెలపాల్సి ఉంది. వాటిలో భారతదేశం కూడా ఉంది.