పముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్ (ఈఏసీ-పీఎం)గా నియమితులయ్యారు.
ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న ఈయన, గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చి సంస్థ డైరెక్టర్గా (ఉప కులపతి), కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షునిగా పనిచేశారు.
మహేంద్రదేవ్ స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి.
ఆయన గతంలో ప్రపంచబ్యాంక్, యూఎన్డీపీ, యునెస్కో, ఐఎల్ఓ వంటి సంస్థలకు ఆయన సలహాదారుగా పనిచేశారు.