అమరరాజ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ప్రతిష్ఠాత్మక మహాత్మా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పుదుచ్చేరి మాజీ గవర్నర్ డాక్టర్ కిరణ్బేడీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో పోటీతత్వాన్ని ముందుచూపుతో గ్రహించి, యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇచ్చినట్లు పురస్కార కమిటీ ప్రకటించింది.