తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ అధ్యక్షుడు లాజరస్ మెక్కార్థీ చక్వేరాతో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, అక్టోబరు 18న లిలోంగ్వె నగరంలో భేటీ అయ్యారు. సంస్కృతి, క్రీడలు, ఔషధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు వారి సమక్షంలో సంతకాలు చేశారు.
మలావీ రాజధాని లిలోంగ్వేలో జాతీయ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులు అర్పించారు.
మలావీలో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతి ముర్ముయే.