రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్-2026’ను ప్రారంభించారు. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్ ప్రయత్నిస్తుందని రాజ్నాథ్సింగ్ అన్నారు.
2026లో 74 దేశాల భాగస్వామ్యంతో సాగిన మిలన్ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.