వినూత్నత కోసం కృత్రిమ మేధ (ఏఐ), జెనరేటివ్ కృత్రిమ మేధ(జెన్ఏఐ)లపై 90 శాతం దేశీయ ఆర్థిక సంస్థలు దృష్టి పెడుతున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. ‘మ్యాపింగ్ ది ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా’ పేరిట పీడబ్ల్యూసీ ఇండియా ఈ నివేదికను వెలువరించింది.
నివేదికలోని అంశాలు:
ఏఐ, జెన్ఏఐ తర్వాత 74 శాతం మంది డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో భవిష్యత్ అంచనాలు, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈ టెక్నాలజీలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ సర్వేలో 31 ఆర్థిక సంస్థలు (బ్యాంకులు, బీమా సంస్థలు, ఫిన్టెక్లు) పాల్గొన్నాయి.
90% మంది ఏఐ, జెన్ ఏఐలకు ఓటేయగా, 84 శాతం మంది వినియోగదారు సేవలు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ఆన్బోర్డింగ్, సర్వీసింగ్ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వినూత్నతకు ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కీలకమని 50 శాతానికి పైగా పేర్కొన్నారు.