హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బీఈడీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఓడీఎల్)
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందిన ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు అర్హులు.
బోధనా మాధ్యమం: ఉర్దూ.
ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు).
ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,000.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-10-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 03-11-2024.
ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 06-11-2024.
Website:https://manuu.edu.in/