హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) ఏఐసీటీఈ గుర్తింపు పొందిన రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్)- 2025-2027
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2024 స్కోరును కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్, అకడమిక్ రికార్డ్, డైవర్సిటీ ఫ్యాక్టర్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10-02-2025.
Website:https://www.manage.gov.in/