Published on Nov 27, 2025
Admissions
మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ అగ్రీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ కోర్సు
మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ అగ్రీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ కోర్సు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్‌) 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు, అగ్రి రంగంలో మేనేజీరియల్‌ నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిచారు. 

వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)- 2026-2028

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్ సంబంధ విభాగాల్లో) ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌-2025 స్కోరును కలిగి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2026 నాటికి డిగ్రీ అర్హత సమర్పించాలి.

ఎంపిక విధానం: క్యాట్-2025 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష/ ఇంటర్వ్యూ కేంద్రం: మేనేజ్‌ క్యాంపస్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10-02-2026.

ఎస్సై రైటింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 2026.

ఫలితాలు: ఏప్రిల్‌/మే 2026.

Website:https://www.manage.gov.in/