- మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉమ్మడిగా రూపాంతరీకరణను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్-మలేసియా భాగస్వామ్యం’ (ఇంపాక్ట్) అనేదే రెండు దేశాలకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు.
- మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇద్దరు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, ఒడిస్సీ తదితర శాస్త్రీయ నృత్యాలతో 800 మంది కళాకారులు మోదీని స్వాగతించడం ‘మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదైంది.