Published on Mar 18, 2025
Current Affairs
మోదీతో క్రిస్టోఫర్‌ లక్సాన్‌ భేటీ
మోదీతో క్రిస్టోఫర్‌ లక్సాన్‌ భేటీ

భారతదేశ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి క్రిస్టోఫర్‌ లక్సాన్‌ 2025, మార్చి 17న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల లాంటి రంగాలకు సంబంధించి ఆరు ఒప్పందాలపై రెండు పక్షాలు సంతకాలు చేశాయి.

రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగతపరచుకోవాలని భారత్, న్యూజిలాండ్‌ నిర్ణయించుకున్నాయి.