రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో 2025, ఫిబ్రవరి 28న భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భారత్, ఐరోపా యూనియన్ (ఈయూ) కమిషన్ మధ్య దీర్ఘకాలంగా చర్చల్లో నానుతున్న మెగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) 2025 చివరికల్లా పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించాయి.
రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్, ఈయూ నిర్ణయించాయి.
తమ సన్నిహిత మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో కుదుర్చుకున్న తరహాలో భారత్తోనూ భద్రత, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు లెయెన్ తెలిపారు.
2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్మ్యాప్ను ఇప్పటికే సిద్ధం చేశామని, 2025 భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని మోదీ పేర్కొన్నారు.