ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3’తో సైప్రస్ గౌరవించింది.
2025, జూన్ 16న ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
దీంతో కలిపితే ఇప్పటివరకూ ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 23కు చేరుకుంది.
సైప్రస్ పర్యటనలో భాగంగా నికోస్ క్రిస్టోడౌలిడెస్తో సమావేశమైన మోదీ.. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణంసహా పలు ద్వైపాక్షిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు.