Published on Nov 18, 2024
Current Affairs
మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైజర్‌’తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్‌ టినుబు అవార్డును మోదీకి 2024, నవంబరు 17న అందించారు. 1969లో క్వీన్‌ ఎలిజబెత్‌కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు.