క్రియాశీలకంగా లేని మ్యూచువల్ ఫండ్ ఖాతాల్లోని పెట్టుబడులను క్లెయిమ్ చేసుకునేందుకు, అన్వేషణలో మదుపర్లకు సహకారం అందించేందుకు ‘మిత్రా’ పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను సెబీ తీసుకొచ్చింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కేవైసీ వివరాల నవీకరణకూ ఇది తోడ్పడనుంది. తమ పేరు మీద పెద్దలు పెట్టుబడులు పెట్టారనే అవగాహన లేకపోవడం; మారిన చిరునామా, ఫోన్ నెంబర్, వ్యక్తిగత సమాచారాన్ని ఆయా పథకాల్లో లేనందున.. ఒక్కోసారి ఫండ్ పథకాల్లో పెట్టుబడుల విషయం కొందరు మదుపర్లకు తెలియడం లేదు. ఈ తరహా సమస్యకు ఈ ప్లాట్ఫామ్ పరిష్కారం చూపిస్తుందని సెబీ తెలిపింది.