మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్సింగ్ 2025, ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ అజయ్కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందించారు. దాన్ని గవర్నర్ ఆమోదించారు.
జాతుల వైరంతో 2023 మే నుంచి మణిపుర్లో చెలరేగిన అల్లర్లలో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు.