మణిపుర్లో 2025, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.
మణిపుర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఉత్తర్వులిచ్చారు. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచినట్లు తెలిపింది.
మణిపుర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. గవర్నర్ అజయ్కుమార్ భల్లా నివేదిక, ఇతరత్రా సమాచారం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు.