Published on Feb 17, 2025
Current Affairs
మెటా సముద్రగర్భ కేబుల్‌
మెటా సముద్రగర్భ కేబుల్‌

ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ అయిన ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’కు భారత్‌నూ అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం మెటా 2025, ఫిబ్రవరి 15న తెలిపింది. మెటా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కేబుల్‌ ద్వారా కార్యకలాపాలు, ఈ దశాబ్దం చివరకు ప్రారంభమవుతాయని అంచనా. 

ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్‌ పొడవు 50,000 కి.మీ.కు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ. ఈ కేబుల్‌కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు.