ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ అయిన ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’కు భారత్నూ అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం మెటా 2025, ఫిబ్రవరి 15న తెలిపింది. మెటా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కేబుల్ ద్వారా కార్యకలాపాలు, ఈ దశాబ్దం చివరకు ప్రారంభమవుతాయని అంచనా.
ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్ పొడవు 50,000 కి.మీ.కు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ. ఈ కేబుల్కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు.