రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. భారత సరీసృప జంతుజాల వర్గీకరణలో చాలాకాలంగా ఉన్న తప్పులను సరిచేసి, కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు. దీనికి కలమారియా మిజోరమెన్సిస్ అని నామకరణం చేశారు. పామును కనుగొన్న రాష్ట్రానికి గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.