38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ (7 స్వర్ణాలు, ఒక రజతం, 6 కాంస్యాలు) 18వ; తెలంగాణ (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానాలతో ముగించాయి.
పోటీల చివరిరోజైన 2025, ఫిబ్రవరి 13న తెలంగాణకు మరో రెండు కాంస్య పతకాలు లభించాయి. షూటింగ్, నెట్బాల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు.
షాట్గన్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో బత్తుల మునెక్- రష్మీ రాఠోడ్ జోడీ కాంస్యం సాధించింది. మిక్స్డ్ నెట్బాల్ విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
మొత్తంగా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ 121 పతకాలతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలుచుకుంది.
మహారాష్ట్ర 198 (54 స్వర్ణాలు, 71 రజతాలు, 73 కాంస్యాలు) రెండు, హరియాణా 153 (48 స్వర్ణాలు, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానాలు దక్కించుకున్నాయి.
ఈ రెండు జట్లు సర్వీసెస్ కన్నా ఎక్కువ పతకాలు గెలిచినా స్వర్ణాల్లో వెనకబడ్డాయి.