ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి, నాట్యగురువు మంగళాభట్ (62) 2025, జూన్ 16న హైదరాబాద్లో కన్నుమూశారు.
ప్రఖ్యాత నాట్యగురువు రాఘవరాజ్భట్ సతీమణి, జానపద కళాబ్రహ్మ గోపాల్రాజ్భట్ కోడలు అయిన మంగళాభట్ హైదరాబాద్లో ఆకృతి కథక్ కళాకేంద్రం ద్వారా మూడున్నర దశాబ్దాలుగా ఎంతోమందిని తీర్చిదిద్దారు.
ఆమె మహారాష్ట్రలోని కొల్హాపుర్లో జన్మించారు.
1990లో మంగళాభట్ తన భర్తతోకలిసి హైదరాబాద్లో ఆకృతి కేంద్రాన్ని ప్రారంభించారు.
కథక్ సంప్రదాయంలో ప్రయోగాలు చేసి మెప్పించారు.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.