Published on Dec 27, 2024
Current Affairs
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు

ప్రతిష్ఠాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ, దిల్లీ) డైరెక్టర్‌గా చెరుకుపల్లి శ్రీనివాసరావు 2024, డిసెంబరు 26న నియమితులయ్యారు.

ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి, శాస్త్రవేత్త ఈయనే. శ్రీనివాసరావు స్వస్థలం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు. 

బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1982-86లో ఏజీ బీఎస్సీ, 1986-88 వరకు పీజీ చదివారు.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేశారు. 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.