దేశంలోనే తొలిసారిగా, సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్ఫామ్ ‘భారత్ ట్యాక్సీ’ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా 2026, ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు దిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లలో అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లలో దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలన్నది లక్ష్యం. ఈ యాప్తో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అమిత్ షా వెల్లడించారు.