‘భారత్ టెక్స్ 2025’ కార్యక్రమంలో 2025, ఫిబ్రవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ప్రపంచంలో టెక్స్టైల్స్ ఎగుమతుల్లో భారత్ 6వ స్థానంలో ఉన్నట్లు, 2024-25లో రూ.3 లక్షల కోట్ల టెక్స్టైల్ ఎగుమతులు చేసినట్లు మోదీ తెలిపారు.
టెక్స్టైల్ రంగం 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతులే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.5,272 కోట్ల (బడ్జెట్ అంచనాలు) నిధులను టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు కేటాయించారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ అంచనా రూ.4,417.03 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం.