భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్మూర్తి నియమితులయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను 15వ కాగ్గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024, నవంబరు 18న పేర్కొంది.
ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న గిరీశ్చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్మూర్తికి అవకాశం కల్పించారు.
ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి రికార్డులకెక్కారు.
ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది.