Published on Oct 11, 2024
Current Affairs
భారత్‌-ఆసియాన్‌ సదస్సు
భారత్‌-ఆసియాన్‌ సదస్సు

లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో 2024, అక్టోబరు 10న జరిగిన 21వ భారత్‌-ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌-ఆసియాన్‌ మధ్య సమగ్ర భాగస్వామ్య బలోపేతానికి 10 సూత్రాల ప్రణాళికను మోదీ ప్రకటించారు. ఆసియా భవిష్యత్తుకు ఈ ప్రాంతీయ దేశాల కూటమితో సంబంధాలు కీలకమని వ్యాఖ్యానించారు. 

ఆసియన్‌ ప్రాంతీయ కూటమిలో మలేసియా, థాయ్‌లాండ్, బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, లావోస్, సింగపూర్, భారత్‌ ఉన్నాయి.