2021-25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత మొత్తం ఎగుమతుల్లో 18% వాటా ఆ దేశానిదే. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బి.డాలర్లు(రూ.16.7 లక్షల కోట్లు)గా ఉంది. సేవల విషయానికొచ్చినా భారత్ నుంచి 28.7 బి.డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. మొత్తం మీద (వస్తువులు, సేవలు) చూస్తే వాణిజ్య మిగులు అమెరికాతో 44.4 బి. డాలర్లుగా ఉంది.