Published on Jan 2, 2025
Current Affairs
భారత్‌లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు
భారత్‌లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు

భారతదేశంలో భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాలు 2020లో అంతకు పూర్వం సంవత్సరంతో పోలిస్తే 7.93 శాతం మేరకు తగ్గాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు విభాగానికి సమర్పించిన ఒక నివేదికలో భారత్‌ తెలిపింది.

అలాంటి ఉద్గారాలు 2005-2020 మధ్యకాలంలో స్థూలంగా 36 శాతం పడిపోయాయని అందులో వివరించింది. 

2019తో పోలిస్తే ఉద్గారాలు 7.93 శాతం తగ్గినా, 1994 నుంచి చూస్తే 98.34 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది.

వర్ధమాన దేశాలు రెండేళ్లకోసారి ఈ నివేదికను ఐరాస విభాగానికి సమర్పించాల్సి ఉంది.