భారతదేశానికి చెందిన ఖోఖో క్రీడను అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ప్రపంచకప్ నిర్వహించబోతున్నారు. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2025, జనవరి 13 నుంచి 19 వరకు దీల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచకప్ జరుగుతుందని 2024, అక్టోబరు 16న నిర్వాహకులు ప్రకటించారు.