విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గతంలో 200 రోజుల ప్రపంచ రికార్డు ఉండగా దాన్ని అన్మిష్ కేవలం 92 రోజుల 4 గంటల్లోనే చేరుకొని రికార్డు నెలకొల్పారు.
2025 అక్టోబరు 23న రష్యాలోని ఎల్బ్రస్ పర్వత అధిరోహణతో మొదలుపెట్టి ఆ తర్వాత అర్జెంటీనాలోని ఒజాస్ డెల్ సలాడో, టాంజానియాలోని కిలిమంజారో, మెక్సికోలోని పికో డె ఒరిజాబా, ఇరాన్లోని దమావంద్, పపువా న్యూ గినీలోని గిలూవే పర్వతాలను ఆయన అధిరోహించారు. 2026 జనవరి 23తో అంటార్కిటికాలోని సిడ్లీ అగ్నిపర్వతాన్ని ఎక్కడం ద్వారా ప్రయాణం పూర్తయింది.