Published on Oct 14, 2025
Current Affairs
బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహం
బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహం

ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్‌ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది.

వచ్చే నాలుగేళ్లలో ఈ శ్రేణికి చెందిన 8-10 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని పేర్కొంది.

‘దృష్టి’ అనే ఈ ఉపగ్రహం 160 కిలోల బరువును కలిగి ఉంటుంది. 

భారత్‌లోని ప్రైవేటు పరిశ్రమ నిర్మించిన శాటిలైట్లలో ఇదే అతిపెద్దది కావడంతోపాటు అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌ కలిగి ఉందని గెలాక్స్‌ఐ పేర్కొంది. 

ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందిస్తుంది.