బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ బింద్రా కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. బింద్రా 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) అధ్యక్షుడిగా వ్యవహరించారు. బింద్రా, మరో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా.. 1987 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు భారత్కు దక్కడంలో కీలక పాత్ర పోషించారు.