బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి, నిపుణులపై 2025, జూన్ 12న నివేదిక విడుదల చేసింది.
దీని ప్రకారం, ప్రస్తుతం భారత్లో 6 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా, 2027 నాటికి ఈ సంఖ్య 12.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది మన దేశంలోనే.
ప్రపంచ వ్యాప్త ఏఐ నిపుణుల్లో 16 శాతం మంది ఇక్కడ ఉన్నారు.