ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కుతుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం లభిస్తుంది. ఇవి ఇప్పటికే దేశంలోనే పొడవైన గుహలుగా పేరు తెచ్చుకున్నారు. ఏడాదికి దాదాపు 2 లక్షల మంది వీటిని సందర్శిస్తుంటారు.