బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పర్మినెంట్ ప్రాతిపదికన సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 5
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్), ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1.10.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ది మేనేజర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జాలహళ్లి పోస్ట్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2024.
Website:https://bel-india.in/