ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) మచిలీపట్నం ప్రాజెక్ట్/ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్): 06
2. ప్రాజెక్ట్ ఇంజినీర్(మెకానికల్): 01
3. ట్రైనీ ఇంజినీర్(మెకానికల్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 జూన్ 1వ తేదీ నాటికి 32 - 37 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్కు రూ.40,000 - రూ.55,000, ట్రైనీ ఇంజినీర్కు రూ.30,000 - రూ.40,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 28.