ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఉత్తరాఖండ్ ఒప్పంద ప్రాతిదికన కింది ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 05
వివరాలు:
1. ట్రైనీ ఇంజినీర్-1 (ఎలక్ట్రానిక్స్): 03
2. ప్రాజెక్ట్ ఇంజినీర్-1(ఎలక్ట్రానిక్స్): 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1-06-2025 తేదీ నాటికి ట్రైనీ ఇంజినీర్కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్కు రూ.45,000 - రూ.55,000, ట్రైనీ ఇంజినీర్కు రూ.30,000 - రూ.40,000.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472, రూ.177. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 15.
చిరునామా: సీనికర్ డీజీఎం(ఈఎస్&హెచ్ఆర్&ఏ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కొత్ద్వారా, పౌరీ గర్వాల్, ఉత్తరాఖండ్ - 246149.
Website:https://bel-india.in/job-notifications/