ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) నవీ ముంబయి యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ట్రెయినీ ఇంజినీర్-1 (మెకానికల్): 04
2. ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్), బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 1-12-2025వ తేదీ నాటికి 28 - 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ట్రెయినీ ఇంజినీర్కు రూ.30,000 - రూ.40,000, ప్రాజెక్ట్ ఇంజినీర్కు రూ.40,000 - రూ.55,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: పోస్టులను అనుసరించి రూ.150 నుంచి 400+జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ)/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 6.