Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 5, 2026
Current Affairs
బాలల్లో ఊబకాయం నివారణ కొత్త లక్ష్యం 2030
బాలల్లో ఊబకాయం నివారణ కొత్త లక్ష్యం 2030
  • బాలల్లో ఊబకాయాన్ని నిరోధించాలనే లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్‌తో సహా పలు దేశాలు విఫలమవుతున్నాయని ప్రపంచ దేహస్థౌల్య నిరోధ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. అసలు 2025 ఏడాదిలోగా ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆశించినా నెరవేరకపోవడంతో గడువును 2030కి పొడిగించారు.
  • 2040కల్లా భారత్‌లో 2 కోట్ల మంది బాలలు ఊబకాయంతో, 5.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని సమాఖ్య అంచనా. 2026, మార్చి 4న ఈ సమాఖ్య విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 నాటికి చైనా, భారత్, అమెరికాలలో ఒక్కో దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు.  భారత్‌లో 4.1 కోట్ల మంది అధిక బీఎంఐతో, 1.4 కోట్ల మంది ఊబకాయం రుగ్మతతో ఉన్నారు.