- అంతర్జాతీయ స్థాయిలో 40 మంది నిపుణులతో కృత్రిమ మేధపై ఐక్యరాజ్యసమితి కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి ఐఐటీ-మద్రాస్ ప్రొఫెసర్ బలరామన్ రవీంద్రన్ ఎంపికయ్యారు. ఈ జాబితాలోని నిపుణులను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వయంగా సిఫార్సు చేశారు. మూడేళ్ల పాటు ఈ కమిటీ కొనసాగుతుంది.
- బలరామన్ రవీంద్రన్ ఐఐటీ మద్రాస్లో డేటా సైన్స్, కృత్రిమ మేధ విభాగం, ‘సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ’ అధిపతిగా ఉన్నారు. అమెరికాలో ప్రొఫెసర్గా పని చేస్తోన్న విపిన్ కుమార్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.