మామిడి పండు ఆధారిత దేశీయ పానీయం మాజా 2024లో బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,700 కోట్ల) బ్రాండ్గా మారింది.
ఇది కోక-కోలా యాజమాన్యంలో ఉంది. 2021లో కోక-కోలా దేశీయ బ్రాండ్ థమ్సప్ కూడా ఈ ఘనత సాధించింది.
1993లో కోక-కోలా కంపెనీ మాజా, థమ్సప్లను రమేశ్ చౌహాన్ నుంచి కొనుగోలు చేసింది.
వీటితో పాటు చౌహాన్ సోదరుల నుంచి గోల్డ్ స్పాట్, లిమ్కా తదితర మొత్తం పానీయాల పోర్ట్ఫోలియోను కొనుగోలు చేసి భారతీయ విపణిలోకి కోక కోలా అడుగుపెట్టింది.