Published on Feb 12, 2025
Current Affairs
బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి మాజా
బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి మాజా

మామిడి పండు ఆధారిత దేశీయ పానీయం మాజా 2024లో బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,700 కోట్ల) బ్రాండ్‌గా మారింది.

ఇది కోక-కోలా యాజమాన్యంలో ఉంది. 2021లో కోక-కోలా దేశీయ బ్రాండ్‌ థమ్సప్‌ కూడా ఈ ఘనత సాధించింది. 

1993లో కోక-కోలా కంపెనీ మాజా, థమ్సప్‌లను రమేశ్‌ చౌహాన్‌ నుంచి కొనుగోలు చేసింది.

వీటితో పాటు చౌహాన్‌ సోదరుల నుంచి గోల్డ్‌ స్పాట్, లిమ్కా తదితర మొత్తం పానీయాల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసి భారతీయ విపణిలోకి కోక కోలా అడుగుపెట్టింది.