ఐటీ సేవల విభాగంలో అత్యంత విలువైన 25 బ్రాండ్ల జాబితాలో దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ, హెగ్జావేర్ టెక్లకు చోటు లభించింది.
బ్రాండ్ ఫైనాన్స్ ఈ జాబితాను రూపొందించింది. ఐటీ సేవల కంపెనీల బ్రాండ్ల మొత్తం విలువలో అమెరికా వాటా 40% కాగా, 36% వాటాతో మన దేశం రెండో స్థానంలో నిలిచింది.
భారత్కు చెందిన ఐటీ కంపెనీల బ్రాండ్ల విలువ మొత్తంగా 14% పెరగడం ఇందుకు దోహదం చేసింది.