నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (ఎన్టీఏ) 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ డీబీటీ - జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు:
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) 2025
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వ్యవధి: 180 (3 గంటలు) నిమిషాల సమయం.
దరఖాస్తు రుసుము: రూ.1300; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.650.
ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 28-03-2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 30-03-2025 నుంచి 31-03-2025 వరకు.
పరీక్ష తేదీ: 13-05-2025.
Website: https://exams.nta.ac.in/DBT/
Apply online: https://dbt2025.ntaonline.in/