Published on Oct 3, 2024
Current Affairs
బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణం
బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణం

అస్సాంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని నాలుగు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024, అక్టోబరు 2న వర్చువల్‌గా ప్రారంభించారు. ‘స్వచ్ఛభారత్‌ దివస్‌’ సందర్భంగా స్థిరమైన, పర్యావరణ అనుకూల శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని విస్తరించనున్నారు.

అస్సాంలో గువాహటి, జోర్హాట్, శివసాగర్, తిన్‌సుకియా ప్రాంతాల్లో కీలక ఆయిల్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.