ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వివిధ జోన్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 400
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.12.2025 తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.13,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 25.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 10.
Website:https://bankofindia.bank.in/career/recruitment-notice